

రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి డి. అనసూయ (సీతక్క) మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఔన్నత్యాన్ని, సాంస్కృతిక ముఖ్యతను ప్రపంచానికి మీడియా ద్వారా చూపించాలని కోరారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో బుధవారం జర్నలిస్టులు మరియు మీడియా ప్రతినిధులకు టీ షర్ట్లను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. భక్తుల రాక భారీగా ఉన్నప్పటికీ, ఆదివాసుల ఆత్మగౌరవం, పూజా విధానాలు, సంప్రదాయాలు ఏ విధంగానూ మారకుండా ఏర్పాట్లు చేశారు అని మంత్రి తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, భక్తులకు అసౌకర్యం కలగకుండా రోడ్డు విస్తరణ, మెరుగైన పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్ అలంకరణలు, క్యూ లైన్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు నాలుగు రోజుల జాతర కోసం టాయిలెట్స్, త్రాగునీటి సరఫరా, అదనపు పారిశుధ్య సిబ్బంది ముందుగానే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జాతరలో సుమారు 20 లక్షల మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. అలాగే, మీడియా కవర్ ద్వారా జాతర ఔన్నత్యాన్ని ప్రపంచానికి చూపించవచ్చని, రాబోయే జాతర సమయంలో జర్నలిస్టుల కోసం పెద్ద హాల్ మరియు మెరుగైన సౌకర్యాలను అందిస్తామని హామీ ఇచ్చారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!