

టీతో చాలా మందికి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి వరకు పలుమార్లు టీ తాగే అలవాటు చాలామందిలో కనిపిస్తుంది. అయితే టీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు కూడా కొందరిలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా దంతాల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు జీర్ణవ్యవస్థపై కూడా ప్రభావం పడొచ్చని చెబుతున్నారు. టీ సాధారణంగా వేడిగా ఉంటుంది. వెంటనే చల్లటి లేదా సాధారణ ఉష్ణోగ్రతలో ఉన్న నీరు తాగితే దంతాల ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పు వస్తుంది. దీంతో దంతాలపై ఉండే రక్షణ పొర ఎనామెల్ బలహీనపడే అవకాశం ఉంది. ఫలితంగా దంతాల సున్నితత్వం, చిగుళ్ల సమస్యలు రావచ్చు.
అలాగే టీలో ఉండే కెఫీన్, టానిన్స్ కారణంగా టీ తాగిన వెంటనే నీళ్లు తాగితే కడుపులోని జీర్ణరసాల ప్రభావం తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాక ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వేడి టీ, చల్లటి నీటి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం కడుపులోని సున్నితమైన పొరపై ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటును ఎక్కువకాలం కొనసాగిస్తే కడుపు సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల వల్ల జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు.













.webp&w=3840&q=75)






.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!