

దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుండయ్ మోటార్ కంపెనీ, దేశీయ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్తో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. నిన్న ప్రకటించిన ఈ ఒప్పందం ప్రకారం, ఇరు సంస్థలు కలిసి విద్యుత్ త్రిచక్ర వాహనాల అభివృద్ధి, దేశీయ తయారీతో పాటు భారత్ సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విక్రయాలను చేపట్టనున్నాయి.
ఈ భాగస్వామ్యంలో హ్యుండయ్ మోటార్ తన ఆర్ అండ్ డీ నైపుణ్యం, ఆధునిక మొబిలిటీ టెక్నాలజీలు, మానవ కేంద్రిత డిజైన్ విధానంతో ఎలక్ట్రిక్ త్రీవీలర్ల రూపకల్పనలో ముందుండనుంది. అలాగే వాహనాల అభివృద్ధి ప్రక్రియలో కూడా కీలక పాత్ర పోషించనుంది.
మరోవైపు టీవీఎస్ మోటార్ తన ఎలక్ట్రిక్ త్రీవీలర్ ప్లాట్ఫామ్, ఇంజనీరింగ్ అనుభవం, స్థానిక మార్కెట్ పరిజ్ఞానాన్ని అందించనుంది. అదనంగా తయారీ, విక్రయాలు మరియు భవిష్యత్తులో ఎగుమతుల బాధ్యతలను కూడా టీవీఎస్ చేపట్టనుంది. ఎలక్ట్రిక్ త్రీవీలర్ విభాగంలో టీవీఎస్ ఇప్పటికే ప్రయాణికుల కోసం ‘కింగ్ ఈవీ మ్యాక్స్’, సరుకు రవాణా కోసం ‘కింగ్ కార్గో హెచ్డీ ఈవీ’ మోడళ్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది.



.jpg&w=3840&q=75)









.webp&w=3840&q=75)






.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!