

ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశి జిల్లాలో ఉన్న గంగోత్రి ఆలయంలో భక్తులకు కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఆలయంలోకి ప్రవేశించే ముందు పంచగవ్యాన్ని స్వీకరించడం తప్పనిసరిగా నిర్ణయించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఆలయ వర్గాల ప్రకారం, ప్రస్తుతం జరుగుతున్న చార్ధామ్ యాత్ర సమయంలో నిజమైన భక్తులే ఆలయంలోకి ప్రవేశించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పంచగవ్యం అనేది గోమూత్రం, గోమయం, పాలు, పెరుగు, నెయ్యి కలిపి తయారు చేసే సంప్రదాయ మిశ్రమం. కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలలో దీనిని పవిత్రంగా భావిస్తారు.
ఆలయ పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు ఈ ఆచారాన్ని పాటించేందుకు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో హిమాలయ ప్రాంతంలోని పవిత్ర క్షేత్రాలకు భారీ సంఖ్యలో యాత్రికులు చేరుకుంటున్నారు.






.jpeg&w=3840&q=75)






.webp&w=3840&q=75)






.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!