

ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం భారత్పై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ దిగుమతులు, విమానయాన రంగం, పర్యాటక రంగంతో పాటు విదేశాల్లో ఉన్న భారతీయులు పంపించే రెమిటెన్స్లపై ప్రభావం పడుతోంది. భారత్ ప్రపంచంలోనే అత్యధిక రెమిటెన్స్లు అందుకునే దేశంగా ఉండగా, 2024–25లో రూ.11.6 లక్షల కోట్ల వరకు విదేశాల నుంచి డబ్బు వచ్చినట్లు అంచనా. ఇందులో గల్ఫ్ దేశాల వాటా సుమారు 38% ఉండటం వల్ల అక్కడి పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి.
యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే గల్ఫ్లో ఉద్యోగ అవకాశాలు తగ్గి, భారతీయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే సుమారు 18 లక్షల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చినట్లు సమాచారం. దీనివల్ల కుటుంబాల ఆదాయాలు తగ్గి, ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అలాగే చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లకు పైగా పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి, విదేశీ మారక నిల్వలు తగ్గి, వాణిజ్య లోటు పెరిగే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు కలిసి యుద్ధాన్ని ఆపేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియలో భారత్ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!