

అమెరికా మరియు ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులతో ఒక వంతెనపై విరుచుకుపడ్డాయని సమాచారం. ఈ దాడుల కారణంగా వంతెనపై పెద్దఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనను ఇరాన్ మీడియా కూడా ధ్రువీకరించింది. అలాగే, ఈ ప్రాంతాన్ని రెండుసార్లు లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించింది.
మొదటిసారి జరిగిన దాడిలో ఇద్దరు పౌరులు మరణించినట్లు తెలిపింది. అనంతరం రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్న సమయంలో మరోసారి దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సహాయక చర్యలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలోనే అతిపెద్దదిగా భావిస్తున్న ఈ వంతెన ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. ఇది ఇరాన్ రాజధాని టెహ్రాన్ను పశ్చిమాన ఉన్న కారజ్ నగరంతో అనుసంధానించేందుకు నిర్మించబడుతోంది. ఈ దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!