

లేడీ సూపర్ స్టార్ నయనతార మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా సినిమా ప్రమోషన్స్కు దూరంగా ఉండే ఆమె, తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ” ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో ఆమె అకస్మాత్తుగా స్టేజ్పైకి వచ్చి భర్తను హగ్ చేయడం, యూనిట్కు శుభాకాంక్షలు తెలపడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇతర నిర్మాతల సినిమాలకు ప్రమోషన్స్కు రాని నయనతార, కేవలం తన భర్త సినిమా కోసం మాత్రమే హాజరయ్యారని ప్రశ్నిస్తున్నారు. ఇది ముందే ప్లాన్ చేసిన ప్రమోషన్ స్టంట్ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, ఈ సినిమాకు ఆమె సహ నిర్మాతగా ఉన్నందున ప్రమోట్ చేయడం సహజమని చెబుతున్నారు. మొత్తంగా నయనతార మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!