
సినిమాలు

దేశంలో కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం పై వచ్చిన అన్ని ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఫీజబులిటీ ఉన్న ప్రాంతాల్లో ఎయిర్పోర్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలోని మామునూరు (వరంగల్) ఎయిర్పోర్టుకు వచ్చే మూడు నెలల్లో శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే ఆదిలాబాద్, కొత్తగూడెం ప్రాంతాల్లో ఎయిర్పోర్టుల నిర్మాణ ప్రతిపాదనలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్లో సైనిక మరియు పౌర అవసరాలకు అనుగుణంగా పెద్ద విమానాశ్రయం నిర్మించాలనే ఆలోచన కేంద్రానికి ఉందని చెప్పారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!