
టెక్నాలజీ

ఇటీవల జరిగిన సైబర్ దాడి కారణంగా భారీ స్థాయిలో సమాచారం లీక్ అయిన నేపథ్యంలో మెటా సంస్థ మెర్కోర్ సంస్థతో ఉన్న పనులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. మెన్లో పార్క్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థకు మెర్కోర్ ముఖ్య భాగస్వామిగా ఉండగా, దాడి తర్వాత భద్రతపై అనుమానాలు వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
కృత్రిమ మేధస్సు నమూనాల పనితీరును పరిశీలించేందుకు నిపుణులను నియమించే సంస్థగా మెర్కోర్ పేరుగాంచింది. ఈ ఘటన తర్వాత ఇతర సంస్థలు కూడా తమ భాగస్వామ్యంపై పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. సంస్థ సైబర్ దాడిపై సమగ్ర విచారణ చేపడుతున్నప్పటికీ, డేటా భద్రతపై ఆందోళనలు కొనసాగుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!