
న్యూస్

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజీపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఘటనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శంకర్ గౌడ్ నివాసానికి భారీగా తరలివచ్చిన ఆర్టీసీ కార్మికులు ఆయన మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేశారు. శంకర్ గౌడ్ ఇంటి ఎదుట ఏర్పాటు చేసిన టెంట్ను కూడా తొలగించారు. నిన్న శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!