
రాజకీయాలు

హైదరాబాద్లో పోలీసులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. నగరంలోని రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, మొత్తం 1300 మంది రౌడీషీటర్లను గుర్తించారు. వారిలో 250 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 190 మంది రౌడీషీటర్లకు డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. దీంతో నగరంలో డ్రగ్స్ వినియోగంపై పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
పరీక్షల్లో ఎక్కువ మంది రౌడీషీటర్లు గంజాయికి అలవాటు పడినట్లు బయటపడింది. ఈ నేపథ్యంలో గంజాయి సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోందన్న అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!