
టెక్నాలజీ
దండకారణ్యాల్లో వరుస ఎన్కౌంటర్లు, కీలక మావోయిస్టు నేతలు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న మావోయిస్టు పార్టీకి మరో పెద్ద ఎదురుదెబ్బ తగలబోతోంది. తాజా సమాచార ప్రకారం, అగ్రనేతలతో కలిసి మొత్తం 37 మంది మావోయిస్టులు ఇవాళ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నారు.
ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన డీజీపీ కార్యాలయం నుంచి ఈ ఉదయం విడుదలైంది. ఈ మేరకు, ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ కార్యాలయంలోని టెన్నిస్ కోర్టు గ్రౌండ్లో జరుపనున్న విలేకరుల సమావేశంలో ఈ లొంగుబాటు కార్యక్రమం జరుగనుంది.
ఈ సమూహ లొంగుబాటు ద్వారా తెలంగాణలో మావోయిస్టుల శక్తి మరింత దెబ్బతిందని, పోలీస్ చర్యలు, అంతర్గత విభేదాలు, వరుస నష్టాలు మావోయిస్టులను ఉద్యమం నుంచి దూరం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!