
గాసిప్స్

గోవా నైట్ క్లబ్ పేలుడు కేసులో ప్రధాన నిందితులైన లూథ్రా బ్రదర్స్ గౌరవ్ లూత్రా, సౌరభ్ లూత్రా ను పోలీసులు అరెస్ట్ చేశారు. థాయ్లాండ్లో దొరికిన వారిని ఢిల్లీకి తరలించి, గోవా పోలీసులు పాటియాలా కోర్టులో హాజరుపరిచారు.
ఆ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రమాదం జరిగిన తర్వాత లూథ్రా బ్రదర్స్ థాయ్లాండ్కు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
భారత మరియు థాయ్లాండ్ అధికారుల సంయుక్త చర్యతో వారిని అదుపులోకి తీసుకుని భారత్కు తీసుకువచ్చారు. పేలుడు కారణాలు, ఉద్దేశ్యం పై దర్యాప్తు కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!