

పిల్లల విక్రయాల కేసులో తప్పించుకుని తిరుగుతున్న ఢిల్లీ ముఠాకు చెందిన కీలక సూత్రధారి ప్రియాంక త్వరలో విజయవాడ పోలీసులకు లొంగిపోనున్నట్లు సమాచారం. ఆమెను అరెస్టు చేసేందుకు విజయవాడ నుంచి ప్రత్యేక బృందం ఢిల్లీ, అనంతరం మేరఠ్కు వెళ్లగా, పోలీసులు చేరకముందే ఆమె ఉత్తరాఖండ్కు పరారైంది. అన్ని వైపులా మార్గాలు మూసుకుపోవడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మేరఠ్లో ఆమె అత్తమామలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం విజయవాడ వచ్చి లొంగిపోవాలని ప్రియాంక నిర్ణయించినట్టు సమాచారం.
పిల్లల విక్రయాల ద్వారా ఆమె భారీగా ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించి సంబంధిత బ్యాంకులకు ఖాతా వివరాల కోసం లేఖలు రాశారు. వివరాలు అందిన తర్వాత లావాదేవీలను పరిశీలించి, తదుపరి చర్యలకు తావులేకుండా ఖాతాలను స్తంభింపజేయనున్నారు. ఈ కేసులో పదేపదే నేరాలకు పాల్పడుతున్న నిందితులపై రౌడీషీట్లు తెరవాలని పోలీసులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో నిందితుడు అనిల్ను పీటీ వారెంట్పై మహారాష్ట్ర నుంచి విజయవాడకు తీసుకువచ్చి, న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కారాగారానికి తరలించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!