
_0.jpg.webp&w=3840&q=75)
చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం భక్తులకు తెరుచుకున్నాయి. గఢ్వాల్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉన్న ఈ పవిత్రక్షేత్రానికి తొలి రోజే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేలాదిగా భక్తులు చేరుకోవడంతో ఆలయ పరిసర ప్రాంతాలు జనసందోహంతో నిండిపోయాయి. ఒక దశలో భక్తుల రద్దీని నియంత్రించడం ఆలయ సిబ్బందికి సవాలుగా మారింది. స్వామి వారి దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లు పూర్తిగా నిండిపోగా, కొంతమంది భక్తులు నిబంధనలు అతిక్రమిస్తూ ఒక క్యూలైన్ నుంచి మరో క్యూలైన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ స్వల్ప ఘర్షణలు, వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆరు నెలల విరామం తర్వాత ఈ నెల 22న కేదార్నాథ్ ఆలయాన్ని తిరిగి తెరిచారు. ఇప్పుడు మరో ఆరు నెలల పాటు భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. ఈ ఏడాది నవంబర్ 11న ఆలయాన్ని మళ్లీ మూసివేయనున్నారు. శీతాకాలంలో ఈ ప్రాంతంలో తీవ్రమైన చలిగాలులు వీయడం వల్ల ప్రతి ఏడాది ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తారు. ఇదే సమయంలో ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాల్లో ఈ నెల 19న చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచారు. అనంతరం ఈ నెల 22న కేదార్నాథ్, ఈ నెల 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.














.jpg&w=3840&q=75)


4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!