
రాజకీయాలు

హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కంటైనర్ నౌకపై ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో నౌకకు కొంత నష్టం వాటిల్లినట్లు వెల్లడైంది.
ఈ విషయాన్ని బ్రిటన్ సైన్యానికి చెందిన యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ ధృవీకరించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ, శాంతి చర్చలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హర్మూజ్ ప్రాంతంలో అమెరికా నేవీ దిగ్బంధం కొనసాగుతుండటమే తాజా ఉద్రిక్తతలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!