
న్యూస్

తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ పార్టీ పేరు “తెలంగాణ ప్రజా వికాస సమితి”గా ఉండొచ్చని, ఇప్పటికే నమోదు చేసినట్టు సమాచారం వినిపిస్తోంది. ఈ వార్తతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది.
ఈ పేరుతో గతంలో సిద్దిపేట ప్రాంతానికి చెందిన మదన్ మోహన్ నేతృత్వంలో “తెలంగాణ ప్రజా సమితి” ఉండేది. అదే ప్రాంతం కవితకు సంబంధించినది కావడంతో ఈ విషయం మరింత చర్చకు దారితీసింది. కొన్ని వర్గాలు ఈ పేరు గత రాజకీయాలను గుర్తు చేస్తుందని భావిస్తున్నాయి.
రేపు ఉదయం కల్లా ఈ పార్టీ పేరు, జెండా, విధానంపై పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఆవిర్భావ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కొత్త రాజకీయ అడుగు ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.















.jpg&w=3840&q=75)


4225-1768468351.png&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!