

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. సభ్యత్వ నమోదు కోసం రూ.2 కోట్ల విరాళం అందించి ఆయన తొలి సభ్యత్వాన్ని స్వయంగా తీసుకున్నారు. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని ముందుకు వచ్చే సభ్యులు పార్టీ బలోపేతానికి కీలకమని ఆయన పేర్కొన్నారు.
సభ్యత్వం తీసుకునే వారికి ప్రత్యేక గుర్తింపులు కూడా ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాల కోసం పని చేసే వారిని “ఉద్యమి”, కొత్త సభ్యులను చేర్చే వారిని “సాధక్”, ఆర్థిక లేదా ఇతర రూపాల్లో సహకారం అందించే వారిని “ప్రదాత”గా పిలుస్తామని తెలిపారు. పార్టీ పోరాటాలకు బలంగా నిలిచే సభ్యత్వ వ్యవస్థను మరింత విస్తరించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.
పార్టీ ప్రారంభ సమయంలో 150 మందితో మొదలైన సభ్యత్వం 2021లో 90 వేలుగా ఉండగా, ఎన్నికల ముందు 6 లక్షలకు చేరింది. ఎన్నికల అనంతరం 12.98 లక్షల సభ్యత్వాలు నమోదు కావడం పార్టీ పెరుగుతున్న బలాన్ని సూచిస్తుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్, పిడుగు హరిప్రసాద్, రామ్ తాళ్లూరి, కళ్యాణం శివ శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!