

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఈ ఆంక్షలు ఐదు వారాలకు పైగా కొనసాగుతున్నాయి. ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ నెట్బ్లాక్స్ అంచనా ప్రకారం, ఇరాన్ 864 గంటల పాటు (36 రోజులు) నిరవధికంగా ఇంటర్నెట్ నిలిపివేసి ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ బ్లాక్ అవుట్లలో ఒకటిగా నిలిచింది. దీనివల్ల ప్రపంచ దేశాలతో ఇరాన్ కమ్యూనికేషన్ తీవ్రంగా దెబ్బతింది.
మయన్మార్, సూడాన్ వంటి దేశాలు సంక్షోభ సమయంలో ఇలాంటి ఆంక్షలు విధించినప్పటికీ, ఇంత కాలం కొనసాగించలేదని నెట్బ్లాక్స్ తెలిపింది. ఉక్రెయిన్, గాజా ప్రాంతం యుద్ధాల్లో మౌలిక సదుపాయాలు దెబ్బ తినడం వల్లే సేవలకు అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం శాటిలైట్ కనెక్షన్లు, వీపీఎన్ వంటి ప్రత్యామ్నాయాలపైనా నియంత్రణ విధించడంతో ప్రజలకు కమ్యూనికేషన్ మార్గాలు లేకుండా పోయాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!