

ట్యాంక్బండ్పై ప్రమాదాల్లో పడిన అనేక మందిని కాపాడి గుర్తింపు పొందిన శివకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శివకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అదేవిధంగా శివ కుమారుడు వేణుమాధవ్కు హోమ్ గార్డ్ ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని కూడా అందజేశారు.
హుస్సేన్ సాగర్ (ట్యాంక్బండ్) పరిసరాల్లో ప్రమాదవశాత్తు నీటిలో పడిన వారిని కాపాడడంలో శివ చేసిన సేవలు ప్రశంసనీయం అని అధికారులు పేర్కొన్నారు. అయితే కుటుంబ పోషణకు సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలియడంతో ముఖ్యమంత్రి స్పందించి అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల క్రితమే అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని శివ కుటుంబాన్ని ప్రభుత్వానికి పరిచయం చేశారు.
ఈ సందర్భంగా ఉపాధి కోసం ట్యాంక్బండ్ సమీపంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలని శివ కోరగా, దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని కూడా సూచించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సహాయం అందుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని శివ కుటుంబ సభ్యులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!