

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ బలం దాని సిద్ధాంతాల్లోనే ఉందని అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తన నివాసంలో బీజేపీ జెండాను ఎగురవేసి, కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అట్టడుగున ఉన్న ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించాలనే అంత్యోదయ సిద్ధాంతాన్ని బీజేపీ కచ్చితంగా అమలు చేస్తోందని, ఈ కారణంగానే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిందని చెప్పారు. ఈ దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు.
మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రస్తావిస్తూ, ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిరం నిర్మాణం, ట్రిపుల్ తలాఖ్ రద్దు, సీఏఏ వంటి సంస్కరణలు దేశానికి మేలు చేశాయని తెలిపారు. కోట్లాది మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చి, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ను ప్రపంచంలోనే అగ్రదేశంగా నిలపాలనే లక్ష్యానికి అందరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!