
క్రీడలు

అమూల్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల వ్యాపారాన్ని దాటి అరుదైన ఘనత సాధించింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ నిర్వహిస్తున్న ఈ బ్రాండ్, గత ఆర్థిక సంవత్సరంలో రూ.90,000 కోట్ల టర్నోవర్తో పోలిస్తే ఈసారి 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో దేశంలో అగ్రగామి డైరీ సంస్థగా అమూల్ తన స్థానాన్ని మరింత బలపరిచింది.
ఈ ఫెడరేషన్ దాదాపు 1,200 రకాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తోంది. 18 జిల్లా కోఆపరేటివ్ సంస్థలు, సుమారు 36 లక్షల మంది రైతులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. రోజుకు 31 మిలియన్ లీటర్ల పాలను సేకరించి, 50 కిపైగా దేశాల్లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. జీసీఎంఎంఎఫ్ చైర్మన్ అశోక్భాయ్ చౌదరి ఈ విజయానికి వినియోగదారుల విశ్వాసం, రైతుల కృషే కారణమని పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!