

2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ వినూత్న దృక్పథంతో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా తొమ్మిదోసారి ఆమె బడ్జెట్ను సమర్పించనుండటం విశేషం. ఈసారి బడ్జెట్పై 16 వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. పలు కేంద్ర ప్రయోజిత పథకాల విలీనంపై కేంద్రం దృష్టి సారించినట్లు సమాచారం. జీ రామ్ జీ వంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉండటంతో పాటు, పెట్టుబడులు, స్వదేశీ తయారీ రంగం, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి రేటు కొనసాగింపుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అంచనా. పన్నుల రేట్లలో మార్పులు ఉంటాయా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రైల్వే సహా మౌలిక సదుపాయాల రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రాలకు సున్నా వడ్డీతో రుణాలు అందించే సాస్కీ పథకానికి కేటాయింపులు పెరిగే అవకాశముంది. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్పై రెండు తెలుగు రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. అమరావతి, పోలవరం, పారిశ్రామిక జోన్లు, పూర్వోదయ పథకం కింద నీటి ప్రాజెక్టులకు నిధులపై ఏపీ ధీమాగా ఉండగా, మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్లో ఐఐటి ఏర్పాటుపై తెలంగాణ ఆశలు పెట్టుకుంది.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!