

జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాద కదలికలు భద్రతా దళాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. కిష్త్వార్ జిల్లాలోని ఛత్రు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు “ఆపరేషన్ ఛత్రు” పేరుతో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ ఆపరేషన్ను ప్రారంభించినట్లు భారత సైన్యం ప్రకటించింది. వైట్ నైట్ కార్ప్స్ బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఉగ్రవాదులు దాక్కున్నారని భావించిన ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు జరిగినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం, రెండు నుండి మూడు మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో దాగి ఉన్నారని అనుమానం. గత కొన్ని నెలలుగా ఈ టీమ్ ఆ ప్రాంతంలో చురుకుగా కదులుతోందని, భద్రతా బలగాలు వారిని గమనిస్తూ ఉన్నాయని తెలుస్తోంది.
కిష్త్వార్లో ఆపరేషన్ ఛత్రు ఇంకా కొనసాగుతున్నందున.. ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారా మట్టుబెట్టారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కిష్త్వార్ జిల్లాలోని ఎత్తైన ఛత్రు ప్రాంతంలో గత ఏడాది నుంచి మధ్యమధ్యలో మిలిటెంట్ కార్యకలాపాలు కనిపిస్తున్నాయి. దీనితో భద్రతా బలగాలు ఇటీవల ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింతగా ముమ్మరం చేశాయి. కిష్త్వార్లో ఆపరేషన్ ఛత్రు ఇంకా కొనసాగుతున్నందున.. ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారా మట్టుబెట్టారా అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (1)
Stay safe, Kishtwar!