

దేశంలో త్వరలోనే పెట్రోల్, డీజిల్ కనుమరుగై ఆల్కహాల్ ఇంధనం అమల్లోకి రానుందా? దీనిపై కేంద్ర స్థాయిలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తుంది. దేశంలో పెట్రోల్కు ప్రత్యామ్నాయం తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. Advertisements Ads end in 07 కొత్త విధానం కనుక అమలైతే త్వరలోనే కార్లు, ఇతర వాహనాలు ఆల్కహాల్ ఇంధనంపై నడుస్తాయి.
పెట్రోల్లో 20 శాతం ఉండే ఈ-20 ఇథనాల్కు స్వస్తి పలికే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో యుద్ధంతో అంతర్జాతీయంగా ఇంధన కొరత ఏర్పడిన క్రమంలో దాని దుష్ప్రభావాలను భారత్ సైతం ఎదుర్కొంది. ఇకపై భారత్ ఎక్కువగా ఎగుమతులపై ఆధారపడకూడదని భావించి ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా, త్వరలోనే ఆల్కహాల్తో కూడిన ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. దీని కోసం 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో కూడిన ఈ-85ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను జారీ చేయడానికి సిద్ధపడుతున్నట్టు సమాచారం.
పెట్రోల్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇదే మంచి ప్రత్యామ్నాయమని భారత్ భావిస్తున్నది. 2016లోనే రూపొందిన ఈ ప్రణాళిక త్వరలోనే అమలులోకి తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇథనాల్ 85 (ఈ-85)కు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుంది. ప్రాథమిక పరీక్షలు కూడా నిర్వహించారని పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక అధికారి వెల్లడించారు. ఈ-85 లేదా ఫ్లెక్స్ ఫ్యూయల్ కోసం ఇంజిన్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. దీని విడుదల రెండు సంవత్సరాలలో జరుగుతుందని అంచనా.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!