
ఇరాన్పై ఇజ్రాయెల్ అనూహ్యంగా దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్లో నివసిస్తున్న భారత పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అధికారిక అడ్వైజరీ జారీ చేసింది. పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని భారతీయులకు సూచించింది.
ఇజ్రాయెల్ అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించింది. అధికారిక ప్రకటనలు, స్థానిక వార్తలు, అత్యవసర హెచ్చరికలను నిరంతరం గమనించాలని తెలిపింది. అవసరమైనప్పుడు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!