

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయ, నీటిపారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆరోగ్య, హోం, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నైరుతి రుతుపవనాలు, ఎల్నినో ప్రభావం, వర్షపాతం అంచనాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా రైతులకు వర్షాభావ పరిస్థితులు, తక్కువ నీరు అవసరమయ్యే పంటలు, పంటల వైవిధ్యం మరియు పంట మార్పిడి ప్రాధాన్యంపై అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రాజెక్టుల గేట్లు, నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. నిర్వహణ పనులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని, దెబ్బతిన్న రహదారులు, కూలిపోయిన వంతెనల పునర్నిర్మాణానికి నిధులు అందించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1,000 కోట్ల నిధులను నిబంధనల ప్రకారం వినియోగించడంతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి, పశు నష్టాలపై అధికారులు వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!