
సినిమాలు

అక్షయ తృతీయ సందర్భంగా తిరుమలలో ప్రత్యేక సందడి నెలకొంది. శ్రీవారి బంగారు, వెండి డాలర్లకు భక్తుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింది. ఆదివారం, సోమవారం రోజుల్లో భక్తులు వరుసలో నిలబడి సుమారు రూ.1.10 కోట్ల విలువైన డాలర్లను కొనుగోలు చేసినట్లు సమాచారం.
బంగారం ధరలు అధికంగా ఉన్నప్పటికీ, అక్షయ తృతీయ శుభసమయంలో శ్రీవారి డాలర్లు కొనుగోలు చేయడం మంగళకరమని భావించి భక్తులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. గత ఏడాది రూ.790 లక్షల విలువైన విక్రయాలు జరగగా, ఈసారి ఆ రికార్డును అధిగమించడం విశేషంగా నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!