
గాసిప్స్

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి మండలం, నిజాంపేట గ్రామంలో ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. సర్వే నంబర్లు 186, 191, 334లలో ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ. 1,300 కోట్లుగా అంచనా వేయబడుతోంది. ప్రభుత్వ భూమిపై అక్రమ కబ్జాలు జరుగుతున్నాయంటూ బాచుపల్లి మండల రెవెన్యూ అధికారులు హైడ్రాను కోరగా, వెంటనే చర్యలు చేపట్టారు.
హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నంబర్ 334లో ఇప్పటికే 4 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురై శాశ్వత నివాసాలు ఏర్పడ్డాయని నిర్ధారించారు. ఆ నివాసాలను ఇబ్బంది పెట్టకుండా, మిగిలి ఉన్న 13 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉన్న తాత్కాలిక షెడ్డులను హైడ్రా తొలగించి, భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!