

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ త్వరలో కార్యరూపం దాల్చడానికి వేగం పెంచింది. ఈ హైస్పీడ్ రైలు ప్రారంభమైతే, ప్రస్తుతం 12 గంటలుగా ఉన్న ప్రయాణ సమయం కేవలం 2 గంటల 20 నిమిషాలకు తగ్గనుంది. తమిళనాడు ప్రభుత్వానికి తుది అలైన్మెంట్ నివేదిక సమర్పించగా, అందులో తిరుపతిలో కొత్త స్టేషన్ను చేర్చారు.
ఈ ప్రాజెక్టుకు మొత్తం 223.44 హెక్టార్ల భూమి అవసరం. భూసేకరణ ప్రక్రియలో ఆలస్యం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. తిరుపతి స్టేషన్ కొత్తగా జోడింపు :తమిళనాడు ప్రభుత్వ అభ్యర్థన మేరకు, గూడూరు మీదుగా ఉన్న పాత ప్రణాళికను మార్చి, తిరుపతిలో బుల్లెట్ రైలు స్టేషన్ను ప్రతిపాదించారు. తమిళనాడు పరిధిలో చెన్నై సెంట్రల్ మరియు చెన్నై రింగ్ రోడ్ అనే రెండు హైస్పీడ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. వాణిజ్య–రవాణా అవసరాల దృష్ట్యా, ప్రతి స్టేషన్ చుట్టూ సుమారు 50 ఎకరాల స్థలం కేటాయించాలని రైల్వే శాఖ కోరింది.
దక్షిణాదిలో ప్రణాళికలో ఉన్న రెండు ప్రధాన హైస్పీడ్ మార్గాల్లో ఇది ఒకటి; మరొకటి హైదరాబాద్–బెంగళూరు కారిడార్.12 కిలోమీటర్ల సొరంగ మార్గం: చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకారం, DPR ఆమోదం వచ్చిన వెంటనే, ఒక నెలలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. తమిళనాడు పరిధిలో సుమారు 12 కి.మీ సొరంగం నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో ఎటువంటి అటవీ ప్రాంతం లేకపోవడం గమనార్హం.
హైస్పీడ్ రైలు మార్గం మొత్తం 65 రోడ్లు మరియు 21 హైటెన్షన్ విద్యుత్ లైన్లను దాటనుంది. రైట్స్ లిమిటెడ్ నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా ఈ మార్గ రూపకల్పన జరిగింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!