
రాజకీయాలు

హైదరాబాద్–చెన్నై బుల్లెట్ రైలు కారిడార్కు కొత్త రూట్ను నిర్ణయించారు. పాత శంషాబాద్–సూర్యాపేట–ఖమ్మం మార్గం స్థానంలో శంషాబాద్, భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి మార్గంగా కొత్త ఎలైన్మెంట్ను రూపొందించారు. ఈ మార్పుతో ప్రాజెక్ట్ కనెక్టివిటీ మెరుగుపడటంతో పాటు భూసేకరణ సమస్యలు తగ్గనున్నాయి.
కొత్త ఎలైన్మెంట్ కారణంగా తెలంగాణలో ప్రాజెక్టు దూరం 236 కిలోమీటర్ల నుంచి 123 కిలోమీటర్లకు తగ్గింది. భూసేకరణ విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గింది. భారత్ సిటీ, డ్రైపోర్ట్, హాలియా, వాడపల్లి వద్ద నాలుగు స్టేషన్లు ప్రతిపాదించగా, అందులో మూడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏర్పాటు కానున్నాయి. సముద్ర తీరంలేని తెలంగాణకు ఎగుమతులు, దిగుమతుల కస్టమ్స్ క్లియరెన్స్ కోసం డ్రైపోర్ట్ స్టేషన్ కీలకంగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!