

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ‘ఆపరేషన్ ఆక్టోపస్ 2.0’ ద్వారా ఛేదించారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించి బ్యాంకు అధికారులు సహా మొత్తం 52 మందిని అరెస్టు చేశారు. పెట్టుబడి మోసాలు, ట్రేడింగ్ స్కామ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను బెదిరించి డబ్బులు దోచుకునే ముఠాలకు అండగా ఉన్న వారిని లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది.
దర్యాప్తులో 32 మంది బ్యాంకు అధికారులు, 15 మంది మ్యూల్ ఖాతాదారులు, ఐదుగురు మధ్యవర్తులు ఉన్నట్లు వెల్లడైంది. కొందరు బ్యాంకు అధికారులు సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కై అక్రమంగా మ్యూల్ ఖాతాలను తెరిచి డబ్బులు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. డీసీపీ వి. అరవింద్ బాబు, ఏసీపీ ఆర్.జి. శివ మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. సుమారు 350 బ్యాంకు ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా 850 కేసులకు సంబంధించి దాదాపు రూ.150 కోట్ల మోసం జరిగినట్లు బయటపడింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!