
న్యూస్

ఐపీఎల్ 2026లో భాగంగా ఏప్రిల్ 19న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన 28వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై ఉత్కంఠభరిత విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 155/9 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (46), యశస్వి జైస్వాల్ (39) మంచి ఆరంభం ఇచ్చినా, కేకేఆర్ బౌలర్లు వరుణ్ చక్రవర్తి (3/14), కార్తిక్ త్యాగి (3/22) అద్భుతంగా రాణించారు. అనంతరం రింకు సింగ్ (53 నాటౌట్) 34 బంతుల్లో మెరుపులు మెరిపిస్తూ, అనుకుల్ రాయ్ (29) సహకారంతో కేకేఆర్ను 19.4 ఓవర్లలో 161/6కు చేర్చాడు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!