

తరచుగా మతిమరుపు రావడం, అందరినీ అనుమానించడం వంటి లక్షణాలు సాధారణ వృద్ధాప్యానికి సంబంధించినవి కాకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి మెదడు సంబంధిత వ్యాధులలో ఒకటైన డిమెన్షియా ప్రారంభ లక్షణాలుగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. మెదడు కణాలు దెబ్బతినడం వల్ల ఈ సమస్య క్రమంగా పెరుగుతుంది.
ఈ వ్యాధి వల్ల వ్యక్తి జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి తగ్గిపోవడంతో పాటు రోజువారీ పనులు చేయడం కూడా కష్టమవుతుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ఈ సమస్యకు ప్రధాన కారణంగా గుర్తించబడింది. ఇది సాధారణ వృద్ధాప్య లక్షణం కాదని, ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ వ్యాధి లక్షణాలు ప్రతి వ్యక్తిలో వేర్వేరుగా కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇతర వ్యాధుల లక్షణాలతో కూడా పోలిక ఉండవచ్చు. కాబట్టి స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరం.
గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించండి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!