
న్యూస్

హైదరాబాద్లో మైలార్ దేవుపల్లి నుంచి శాస్త్రీపురం మీదుగా వట్టేపల్లి వరకు రూ.71 కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ (ఆర్వోబీ)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
నాలుగు లేన్లతో నిర్మించిన ఈ వంతెన పొడవు 490 మీటర్లు, వెడల్పు 16.6 మీటర్లు కాగా, రైల్వే భాగం 37.28 మీటర్లు ఉంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మైలార్ దేవుపల్లి నుంచి ఫలక్నుమా వరకు ప్రయాణ సమయం కేవలం 30 నిమిషాలకు తగ్గి, ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!