
సినిమాలు

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఉప్పాడ సముద్రతీరంలో అలల ఉధృతి మరోసారి పెరిగింది. భారీ కెరటాలు వరుసగా దూసుకొచ్చేసరికి తీరప్రాంతం వేగంగా కోతకు గురవుతోంది. మంగళవారం, బుధవారం రోజుల్లో సముద్రంలో ఏర్పడిన బలమైన పోటు–పాట్ల కారణంగా అలలు తీవ్రంగా ఎగసిపడటంతో కోనపాపపేట తీరంలో గృహాలు, మత్స్యకారుల తాత్కాలిక వసతులు నష్టపోయాయి.
ఒక ఇంటి శ్లాబు పూర్తిగా కూలిపోయింది, తాటాకుపాకలు దెబ్బతిన్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు కోనపాపపేట గ్రామానికి సముద్రం రెండు–మూడు ఫర్లాంగుల దూరంలో ఉండేది. కానీ తుఫాన్లు, అల్పపీడనాలు వరుసగా ఏర్పడటంతో సముద్రం క్రమంగా ముందుకు జరుగు తూ, ఇప్పుడు ఆర్అండ్బీ రోడ్డుకు ప్రమాదకరంగా దగ్గరపడింది. ఈ పరిస్థితి పై స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




.jpg&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!