
గాసిప్స్

హైదరాబాద్ కోఠి ప్రాంతంలోని బ్యాంక్ స్ట్రీట్లో శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోఠి SBI ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సమీపంలో దుండగులు గన్తో కాల్పులు జరిపి రూ.6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన రషీద్ అనే వ్యక్తిని దుండగులు వెంబడించి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో రషీద్కు కాలికి బుల్లెట్ గాయం కాగా, అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నగర మధ్యభాగంలో ఇలా కాల్పుల ఘటన జరగడం కలకలం రేపింది.
.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!