

ఇటీవల ఢిల్లీకి తరచూ వెళ్తున్నారనే విమర్శలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణకు నిధులు, అనుమతులు తీసుకురావడమే తన ఢిల్లీ పర్యటనల లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్ర ప్రయోజనాలపై చర్చిస్తున్నానని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసమే కేంద్రంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చడం సరైనది కాదని ప్రతిపక్షాలపై రేవంత్ రెడ్డి హితవు పలికారు. ప్రభుత్వంతో తమ సమస్యలను పంచుకుంటే, వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి నిధులు, మద్దతు సాధించేందుకు సహకరిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలే తనకు ప్రథమ లక్ష్యమని, రాజకీయ అహంకారం కంటే తెలంగాణ అభివృద్ధినే ముందుంచుతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం వల్లే రాష్ట్రానికి మెరుగైన అవకాశాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!