
గాసిప్స్

తెలంగాణలో పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 31తో గడువు ముగియనుండగా, ఆశించిన స్థాయిలో విద్యార్థుల నుంచి దరఖాస్తులు రాకపోవడంతో అధికారులు గడువు పెంపుపై ఆలోచిస్తున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది సగటున 12.55 లక్షల మంది ePASS వెబ్సైట్లో నమోదు చేసుకుంటుండగా, 2025–26 విద్యాసంవత్సరానికి ఇప్పటివరకు కేవలం 7.65 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మరింత అవకాశం కల్పించేందుకు గడువు పొడిగింపుపై ఎల్లుండిలోగా అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!