

మెక్సికన్ ప్రసిద్ధ చిత్రకారిణి ఫ్రిడా కహ్లో గీసిన ఒక అరుదైన చిత్రకళాఖండం న్యూయార్క్లోని సోథెబైస్ వేలంలో 54.7 మిలియన్ డాలర్లు, అంటే సుమారు రూ.460 కోట్లు ధరకు అమ్ముడైంది.
ఈ పెయింటింగ్ స్త్రీ కళాకారులు గీసిన చిత్రాల్లో ఇప్పటివరకు అత్యధిక ధరకు అమ్ముడైన కళాఖండంగా కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేసుకుంది.
ఇంతకుముందు అమెరికా కళాకారిణి జార్జియా ఓ’కీఫ్ గీసిన “జిమ్సన్ వీడ్/వైట్ ఫ్లవర్” అనే చిత్రం 2014లో 44.4 మిలియన్ డాలర్లకు అమ్ముడై రికార్డు నిలిచింది.
ఫ్రిడా కహ్లో గీసిన ఈ చిత్రం ఒక ప్రైవేట్ కలెక్షన్కు చెందినదని వేలం సంస్థ తెలిపింది.
మెక్సికోలో ఫ్రిడా కహ్లో చిత్రాలు జాతీయ సాంస్కృతిక వారసత్వంగా పరిగణించబడతాయి, అందువల్ల వాటిని దేశం బయటకు తేవడం లేదా నాశనం చేయడం పూర్తిగా నిషేధం.
అందుకే ఈ పెయింటింగ్ అంతర్జాతీయ వేలంలోకి రావడం అత్యంత అరుదైన సంఘటనగా పేర్కొనబడింది.
తాజాగా న్యూయార్క్, లండన్, బ్రసెల్స్ నగరాల నుంచి ఈ చిత్రాన్ని ప్రదర్శన కోసం ఏర్పాట్లు చేయాలని అనేక అభ్యర్థనలు వచ్చినట్లు సమాచారం.




















కామెంట్స్ (1)
A massive win for women in art