
ఓటిటి

అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ అస్సాంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ఎల్లుండి అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో పోలింగ్ జరగనుంది. అస్సాంలో 126 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. దీంతో ఈ మూడు ప్రాంతాల్లో ఎన్నికల ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!