
న్యూస్

డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సీజ్ఫైర్ నిర్ణయంతో, ఇరాన్ సంబంధిత ఉద్రిక్తతలు తగ్గడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు గణనీయంగా పడిపోయాయి. ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లకు తాత్కాలిక ఊరటనిచ్చింది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 110 డాలర్ల నుంచి 95.06 డాలర్లకు తగ్గింది.
అలాగే యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (WTI) క్రూడ్ ధరలు కూడా దాదాపు 20 శాతం పడిపోయినట్లు సమాచారం. సరఫరా అంతరాయం భయాలు తగ్గడంతో చమురు మార్కెట్లు స్థిరపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ధరల తగ్గుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!