

కెనడాలో భారత సంతతికి చెందిన వ్యక్తి మృతి ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందిస్తూ కెనడా ఆరోగ్య వ్యవస్థ పనితీరుపై విమర్శలు గుప్పించారు. పరోక్షంగా దీనిని అమెరికా మోటార్ వెహికల్ విభాగంతో పోల్చుతూ వ్యాఖ్యానించారు.
కెనడాలో నివసిస్తున్న ప్రశాంత్ శ్రీకుమార్కు ఇటీవల ఛాతీలో నొప్పి రావడంతో ఎడ్మంటన్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఈసీజీ పరీక్ష నిర్వహించి గుండెపోటు కాదని నిర్ధారించారు. అయితే ఆస్పత్రిలోనే నిరీక్షిస్తున్న సమయంలో ఆయనకు మరోసారి తీవ్రమైన నొప్పి వచ్చి అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ప్రశాంత్ మృతి చెందాడని వారు ఆరోపించారు. అలాగే ఆస్పత్రి సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తించారని ఆయన భార్య వాపోయారు. ఈ అంశంపై మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన ఎలాన్ మస్క్.. కెనడా ఆరోగ్య వ్యవస్థలో లోపాలు ఉన్నాయని పరోక్షంగా విమర్శించారు.
ఈ ఘటనతో కెనడాలో వైద్య సేవల నాణ్యత, అత్యవసర చికిత్సలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది.




.png&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!