

రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు కావడంతో పాటు, అనర్హుల పేర్లను తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బీఎల్ఓ సూపర్వైజర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణలో ఓటరు జాబితా సవరణకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, వివిధ దశలు, ఐటీ వ్యవస్థల వినియోగం, ఎన్యూమరేషన్ ఫారమ్ల నింపే విధానం వంటి అంశాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఎన్నికల శాఖ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!