

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 7 గంటల పాటు పోలీసులు ఆయనను ప్రశ్నించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారనే ప్రచారంపై తానే సిట్ అధికారులను ప్రశ్నించానని, అందుకు వారు “అటువంటి ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు” అని స్పష్టంగా చెప్పారని కేటీఆర్ వెల్లడించారు.
అలాగే ప్రస్తుతం కూడా బీఆర్ఎస్ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయా? అనే ప్రశ్నను సిట్ను అడిగినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు తమకు తెలియదని మాత్రమే చెప్పారని, ట్యాపింగ్ జరగడం లేదని మాత్రం ఖండించలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమాధానమే చాలా విషయాలకు సంకేతమని అన్నారు. కేసులో A4 రాధాకిషన్ రావుతో కలిసి తనను విచారించారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, “ఈ విచారణలో రామారావు తప్ప ఇంకెవరూ రావు లేరు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయంగా తనను టార్గెట్ చేస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!