

తిరుమల తిరుపతి దేవస్థానానికి మరోసారి విశేషమైన విరాళం అందింది. భక్తుడు మంతెన రామలింగ రాజు కుటుంబం పేరుతో మొత్తం రూ. 9 కోట్లను టీటీడీ కి అందించారు. ఆయన కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేర్లతో ఈ విరాళాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు కు అప్పగించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎంపీ అప్పలనాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునీకరణకు మంతెన రామలింగ రాజు ముందుకొచ్చారని తెలిపారు. ఈ విరాళంతో భవనాలను మరింత సౌకర్యవంతంగా మార్చి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. భక్తి శ్రద్ధతో సేవా కార్యక్రమాలకు ముందుకు వస్తున్న రామలింగ రాజు కుటుంబాన్ని ఆయన అభినందించారు.
చైర్మన్ రామలింగ రాజు 2012 లో కూడా రూ.16 కోట్లు విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తిరుమల దేవుని అనుగ్రహం వారి కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!