
.jpeg&w=3840&q=75)
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రాణాంతక స్థాయికి చేరింది. గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో ప్రజలు శ్వాస తీసుకోవడమే సవాలుగా మారింది. తాజా నివేదికల ప్రకారం, కాలుష్యానికి సంబంధించిన వ్యాధుల కారణంగా ఢిల్లీలో ప్రతిరోజూ సగటున 25 మంది మృతి చెందుతున్నట్లు వెల్లడైంది. చలికాలంలో గాలి నాణ్యత సూచీ (AQI) ‘అత్యంత ప్రమాదకర’ స్థాయికి చేరుతుండటంతో నగరం విష వలయంలో చిక్కుకున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గాలిలో అధికంగా పేరుకుపోతున్న పీఎం 2.5 కణాలు ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ వైఫల్యం, ఆస్తమా, గుండెజబ్బులు వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తున్నాయి. ఇటీవల దట్టమైన పొగమంచు నగరాన్ని కమ్మేయడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని నిపుణులు విమర్శిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహనాల ఉద్గారాలు, నిర్మాణ దుమ్ము ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!