
టెక్నాలజీ

ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు కేసులో కీలకమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇండియా టుడే సమాచారం ప్రకారం, పేలుడులో మరణించిన వ్యక్తి డాక్టర్ ఉమర్ అని అధికారులు ధృవీకరించారు. కారులో లభించిన డీఎన్ఏ నమూనాలు, ఉమర్ కుటుంబ సభ్యుల డీఎన్ఏతో సరిపోలినట్లు నిర్ధారణ అయింది.
ఎర్రకోట సిగ్నల్ వద్ద స్విఫ్ట్ కారుతో జరిగిన ఆత్మహుతి దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఉమర్ పేరుతో రిజిస్టర్ అయిన మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం, సంబంధాలు తెలుసుకునేందుకు పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాలు కృషి చేస్తున్నాయి.











కామెంట్స్ (1)
ఎర్రకోట కారు పేలుడు కేసులో కీలక పరిణామం!