

దిల్ రాజు తన కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అందులో కల్ట్ క్లాసిక్గా నిలిచిన చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా నటించగా, సమంత, అంజలి కథానాయికలుగా కనిపించారు. ఈ చిత్రం 2013 సంక్రాంతికి విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు ఈ సినిమా ప్రారంభానికి ముందు జరిగిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మొదట ఈ కథను కొత్త నటీనటులతో చేయాలని అనుకున్నారని, కానీ స్టార్ హీరోలు ఉంటే మరింత బాగా వర్కౌట్ అవుతుందని తాను సూచించినట్లు చెప్పారు. వెంకటేష్ కథ విని ముందే అంగీకరించగా, మహేష్ బాబు “వెంకటేష్ గారు చేస్తే నేను కూడా చేస్తాను” అని చెప్పడంతో ఈ కలయిక సాధ్యమైందని వివరించారు. చివరికి ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఆయన తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!