

భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె రచించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఇటీవల రాజకీయంగా, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై తాజాగా స్పందించిన నరవణె, ఇంకా ప్రచురణ పొందని పుస్తకాన్ని అనవసరంగా వివాదంలోకి తీసుకువచ్చారని వ్యాఖ్యానించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తనను కూడా ఈ అంశంలో లాగడం సరైంది కాదని పరోక్షంగా విమర్శించారు.
ఇటీవల నరవణె రాసిన మరో పుస్తకం ‘ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్: అన్ఎర్తింగ్ మిలిటరీ మిథ్స్ అండ్ మిస్టరీస్’ విడుదలైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకాన్ని పూర్తిగా పరిశీలించే వరకు ప్రచురణను నిలిపివేయాలని రక్షణ మంత్రిత్వశాఖ కోరిందని తెలిపారు. ఆ తర్వాత తాను ఆ విషయాన్ని ముగిసిన అధ్యాయంగా భావించి ముందుకు వెళ్లానన్నారు. అయితే ప్రచురితం కాని పుస్తకాన్ని బయటకు తీసుకువచ్చి దానిపై పెద్ద చర్చలు జరపడం సరైంది కాదన్నారు. చైనా దళాలతో భారత బలగాల ఘర్షణలకు సంబంధించిన అంశాలు ఈ పుస్తకంలో ఉండటంతో దీనికి అనుమతి లభించలేదు. అయినప్పటికీ అప్పట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని లోక్సభకు తీసుకెళ్లడం పెద్ద చర్చకు దారితీసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!